కావలసినవి
చక్కర- 300 గ్రాములు
జీడిపప్పు-అర కేజి
ఏలకులపొడి- అర టీ స్పూన్
నెయ్యి-అర కప్పు
తయరీ
1. జీడిపప్పును కడిగి గంట సేపు నానబెట్టాలి. ఒకవేళ పొట్టు అలాగే ఉంటే నానిన తరావాత దానిని తీసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి.దీనిని కాజుకోవా అంటారు.
2.ఈ కాజుకోవాను బాణిలిలో వేసి గరిటెతో కలుపుతూ వేడి చేయాలి.అంతా సమంగా వేడెక్కి దోరగా వేగిన తరువాత చక్కర,ఏలకులపొడి వేయాలి.
3. మరలా కలుపుతూ అడుగుకు అంటుకోకుండా మిశ్రమం దగ్గర అయ్యెవరకు మరిగించి దించేయాలి. ఒక పిట మిద నెయ్యి రాసి జీడిపప్పు మిశ్రమాన్ని వేసి పూరీలు ఒత్తే కర్రతో రోల్ చేయాలి
4.మిశ్రమన్ని,అంతా సమనంగా ఒకే మందంగా అయిన తరువాత కావలిసిన ఆకారంలో కట్ చేయాలి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment