కావలసినవి
పాలు-3 లిటర్లు
చక్కర-ఒక కప్పు
గార్నిష్ కోసం -పిస్తా,బాదం
తయారి
పాలను బాగా మరిగించి తరువాత మూతపెట్టకుండా పాత్రను కదిలించకుండా అలాగే ఉంచితే కొద్ది సేపటికి మీగడ మందంగా తయారవుతుంది.దాదాపు రెండు లేదా మూడు గంటల సేపటికి మీగడ అట్టులా పేరుతుంది.అప్పుడు పాత్ర అంచులకు అంటుకుని ఉన్న మీగడ పొరను చాకుతో కాని స్పూన్ తో కాని కట్ చేయాలి.వెడల్పాటి చిల్లుల గరిటె తో మీగడ మడతపడకుండా పొరలాగా వచ్చేటట్లు తీసి మీగడ మీద ఆకు వేసి గరిటేను తిరగేస్తే మీగడ పొర దోసెలాగా ఆకులో కి వస్తుంది. దానిని త్రిభూజాకారంలో ముక్కలూగా కట్ చేయాలి. ఒక ముక్క మిద్ద చక్కర చల్లాలి.అలాగే చక్కర చల్లిన మరొక ముక్కను మొదటి ముక్క మీద బొర్లించాలి.ఇప్పుడు రెండు మీగడ పొరల మీద చల్లిన చక్కర మధ్యలో ఉంటుంది,పైన అల్యూమినియం ఫాయిల్ వేసి బాదం,పిస్తా తో గార్నిష్ చేయాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment