
కావలసినవి
లావు పచ్చిమిరపకాయ- పావు కిలో
ఉల్లిగడ్డ- 1
జీలకర్ర - 1 టీ స్పూన్
నువ్వులు- 2 టీ స్పూన్
కరివేపాకు- రెండు టేబుల్ స్పూనులు
పసుపు- 1/2 టీ స్పూన్
కారం- 1 టీ స్పూన్
ధనియాలపొడి- 1 టీ స్పూన్
కొబ్బరి తురుము- 1 టేబుల్ స్పూను లు
అల్లం వెల్లులి పేస్ట్- 2 టీ స్పూనులు
చిరొంజి(గుమ్మడి లేదా దోస కాయల గింజలు
)- 1 టేబులు స్పూన్
నిమ్మకాయంత చింతపండు(వేడినీటిలో నానబెట్టాలి)
ఉప్పు,నూనె - తగినంత
తయారి
1. ఉప్పు నీటిలో పచ్చిమిరపకాయలు వేసి రంగు విరిగే వరకు వేడి చేసి పక్కన ఉంచుకోవాలి.
2. నువ్వులు,గింజలు,తురిమిన కొబ్బరిని తేలిగ్గ వేయించి పేస్ట్ తయారుచేసుకోవాలి.
3. ఈ పేస్టుకు ధనియాలపొడి,కారం,పసుపు కలపాలి. పాత్రలో నూనె వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడాక మసాలా,అల్లం వెల్లులి పేస్ట్ కలిపి నూనె విడివడే వరకు వేయించాలి.
4. ఉండికించి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు,కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి.
5. చింతపండు నీరు పోసి,సెగ తగ్గించి చిక్కబడే వరకు ఉడకనివ్వాలి.
6.ఇది బిర్యానికి మంచి కాబినేషన్.
No comments:
Post a Comment