
కావలసినవి
ఉల్లిగడ్డలు- 2 పెద్దవి
ఎండు మిర్చి- 3(మధ్యలోకి విరిచి,గింజలు తీసేయాలి)
జీలకర్ర- అర టేబుల్ స్పూన్
మినపప్పు- 1 టీ స్పూన్
ఉప్పు- రుచికి తగినంత
చింతపండు- నాలుగు రేకులు
బెల్లం- అర టీ స్పూన్
పసుపు- చిటికెడు
నూనె- 2 టీ స్పూన్
పోపు కోసం:
ఆవాలు- 1 టీ స్పూన్
కరివేపాకు- ఒక రెబ్బ
నూనె- అర టీ స్పూన్
తయరీ
1.పాన్ లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేడయ్యక,జీలకర్ర,ఎండు మిర్చి వేసి వేయించాక,మినపప్పు రెడ్ కలర్ వచ్చేవరకు వేయించుకుని దింపేసి చల్లార్చాలి.
2. అదే పాన్ లో మరో టీ స్పూన్ నూనె వేసి ఉల్లిపాయల్ని 5 నిమిషాల పాటు వేయించుకుని దింపుకోవాలి.
3. ముందుగా మినపప్పుని,ఎండుమిర్చిని గ్రైండ్ చేసి, ఆ తరువాత ఉల్లిపాయల్ని జతచేసి,ఉప్పు,బెల్లం,చింతపండుని జతచేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
4. పానులో నూనె వేడయ్యాక పోపు దినుసులని,పసుపు వేసి చిటపటలాడించి కరివేపాకుని వేసి,గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అందులో వేసి కలియబెట్టి మంట తీసేయాలి.
No comments:
Post a Comment