కావలసినవి
పాలు-5 లిటర్లు
చక్కర-ఒక కేజి
ఏలకుల పొడి-ఒక టీ స్పూన్
కుంకుంపువ్వు- చిటికెడు
తయారి
రబ్డీ పాన్ లు విడిగా దొరుకుతాయి. వాటికి బదులుగా ఎత్తు తక్కువగా ఉన్న బాణిలో పాలు పొసి మూడు నుంచి నాలుగు పొంగులు వచ్చాక మంట తగ్గించాలి.అప్పుడు మీగడ తేలుతుంది. దానిని చిల్లుల గరిటెతో తీసి పక్కన ఉంచాలి.అలా దాదాపుగా గంట సేపు సన్న మంట మీద మరిగించి మీగడ తీసుకూవాలి.పాలు దగ్గరయాక చక్కర కలిపి,కరిగిన తరువాత దించ్యేయాలి.ఈ పాలలో ఏలకుల పొడి,కుంకుంపువ్వు కలిపి ముందుగా తీసి ఉంచిన మీగడ వేసి కలపాలి.దీనిని అరగంట సేపు ప్రీజ్ లో పెట్టి సర్వ్ చేయాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment