
తయారి సమయం: 3 గంటలు
కావలసినవి
బియ్యం- అర కప్పు (రెండు గంటల ముందుగా నానబెట్టుకోవాలి)
మినపప్పు- పావు కప్పు
టొమాటో- రెండు(తరగాలి)
పచ్చి కొబ్బరి తురుము - రెండు టెబుల్ స్పూన్లు
ఎండుమిర్చి- రెండు(మధ్యలోకి విరిచి గింజలు తీసేయాలి)
బెల్లం తురుము- 2 టబుల్ స్పూన్లు
తరిగిన కొత్తిమీర- 1 టబులె స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె- సరిపడినంత
తయరీ
1.నానబెట్టుకున్న బియ్యం,పప్పుని రుబ్బుతూ ఒక మొస్తారుగా మెదిగిన తరువాత కొబ్బరి,టొమాటో,బెల్లం,కొత్తిమీర,ఉప్పు,ఎండుమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
2. పెనం వేడయ్యాక,నూనె రాసి,రుబ్బుకున్న పిండితో దోసె వేసి,వెంటనే చుట్టు నూనె వేసి 20 సెకన్లపాటు ఉంచి, తిరగేసి వెనక వైపు కూడా లేత బ్రౌన్ కలర్ వచ్చేవరకు కాల్చాలి.
No comments:
Post a Comment